సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు దోనె అశోక్ పాత్రికేయుల సమావేశంలో డా.. దరువు ఎల్లన్న పాల్గొని హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర ను విజయవంతం చేసిన సోదరి సోదరులకు మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మానకొండూరులో అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న రసమయి బాలకిషన్ ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తున్నానని గ్రామాలకు వచ్చుకుంటూ ప్రభుత్వం చెక్కులు పంచుతూ నానా హంగామా చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా ప్రజల పైన ఇక్కడి ప్రాంతం పైన నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడ అభివృద్ధి చేయి అంతేగాని చెక్కుల పేరుతో తన సొంత కష్టార్జితం ఇస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నువ్వు కల్పిస్తున్న భ్రమలను నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మరు ,రానున్నటువంటి రోజుల్లో మానకొండూరు ప్రజలు నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇప్పటికైనా పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రజలకు సహకరించు లేకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో మానకొండూరు ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్తారని. బడుగు బలహీన వర్గాలు ఎదుగుతుంటే ఓర్వలేని నీవు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని విడిచిపెట్టి నీకు వత్తాసు పలికే వారి కోసం పార్టీ పదవులు,అధికారం కట్టబెడుతున్నవు. మానకొండూరు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో మానకొండూరు గడ్డపై నీకు పతనం తప్పదు అని హెచ్చరించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరు అని అన్ని వర్గాల ప్రజలు నీ యొక్క అక్రమాలు చూస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొత్తపేట రామచంద్రం, జిల్లా ఓబీసీ నాయకులు బుర్ర మల్లేశం, బిజెపి మండల కార్యదర్శి వడ్లూరు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొండ వెంకటేశం, ఓబిసి మోర్చ మండల కార్యదర్శి శీలం వెంకటేశం, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మండపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.
