పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దామరచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి గురజాల మండలం పులిపాడు గ్రామానికి కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇస్లావత్ ముజుల (25), భూక్య పద్మ (27), పానియా సక్ర (35), భూక్య నాని (55), మాలావత్ కలిత (30) గుర్తించినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
