contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసీపీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు నాయుడు

  • వినుకొండలో టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. వినుకొండలో తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసుల పై కార్యకర్తలు శాంతియుత నిరసనలు చేపడితే…వైసీపీ నేతలు వారిని రెచ్చగొట్టడమే కాకుండా…దాడులు చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తీరు కారణంగా శాంతి భద్రతల సమస్య వస్తుంటే…నివారించాల్సిన పోలీసులు తిరిగి తెలుగు దేశం కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వినుకొండలో నేటి పరిస్థితులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు నిదర్శనం అని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ చిల్లర వేషాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చంద్రబాబు నాయుడు అన్నారు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఏ స్థాయి పోలీసు అధికారులు అయినా….వాటి విలువ తగ్గకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల రౌడీయిజం పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :