- రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు
- మండలం నుంచి కరీంనగర్ సంబంధించిన రాకపోకలు
- పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్ఐ చాందా నరసింహారావు
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండలంలో భారీ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు నిండుకొని భారీ స్థాయిలో అలుగు పారుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో ఆ వరద నీరు లో లెవెల్ కల్వర్టు రహదారుల పైకి చేరుకుంది. ఈ క్రమంలో మండలం నుంచి ఇటు కరీంనగర్ కు అటు సిరిసిల్లకు రాకపోకలు స్తంభించాయి. మండల కేంద్రం గన్నేరువరం తో పాటు జంగపల్లి,గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల మధ్య రహదారులను పైనుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎస్ఐ చందా నరసింహారావు ఆధ్వర్యంలో కల్వాటులు రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.