సిద్దిపేట జిల్లా :బెజ్జంకి మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా,లింగాల లక్ష్మణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల వెంకటేష్ అధ్వర్యంలో పరదాలు అందజేయటం జరిగింది.
అనంతరం లింగాల లక్ష్మణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిని ఉన్నాయని,వారికి రక్షణగా తమ వంతుగా పరదాలు పంపిణీ చేయటం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగిందని, భారీ వర్షాల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు బోనగిరి శ్రీనివాస్,లింగాల శ్రీనివాస్,రామంచ పర్షరాములు,బోనగిరి మధు, జంగిటి శంకర్,లింగాల శ్రీకాంత్,లింగాల రాజు, లింగాల దిలీప్, లింగాల జితేందర్,బోనగిరి అజయ్,పండుగ మధు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మన్
సిద్దిపేట జిల్లా :బెజ్జంకి మండల కేంద్రంలో పత్రిక ప్రకటన ద్వారా గురువారం మండల ప్రజలకు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృశ్య బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల చెరువులు, కుంటలు మండల వ్యాప్తంగా నిండాయని చెరువులు మత్తడలు పడుతున్నాయని, వర్షాల కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాయి పిల్లలను చెరువులు కుంటలు, విద్యుత్ స్తంభాల వద్దకు పోకుంటా జాగ్రత్తగా కనిపెట్టాలని మండల ప్రజలకు సూచించారు. మండల ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే అధికారులు పోలీసులు మా స్వచ్ఛంద సేవక సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.