- బీసీ సాయం అందరికి ఎన్నికలలోపు అందించాలని అని డా. అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం
సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ: బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రజల్లోకి తీసుకొస్తూ పాత పథకాలను మరుగున పెట్టడాన్ని నిరసిస్తూ మానకొండూర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శానగొండ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యములో బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం నిరసన వ్యక్తం చేసిన కాంగ్రేస్ శ్రేణులు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రజల్లోకి తెస్తూ పాతపథకాల అమలులో చిత్తశుద్ధి లేకుండ మరుగున పెట్టడం. ప్రజలను ఆశల పల్లకిలో ఉంచుతూ పబ్బం గడుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ రోజునుండి ఏ పథకం రెండో దఫాకు చేరుకోలేదు. దళితుల మూడెకరాలు ఒకే దఫా, యంత్రలక్ష్మి పథకంలో ఒకేసారి ట్రాక్టర్లను పంపిణి చేసి మానేశారు. గొర్ల, బర్ల పథకం ఒకే దఫా, ముదిరాజులకు వాహనాలు ఒకే దఫా, గౌడలకు పింఛన్లు ఒకే దఫా, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ పంపిణి, ఏ పథకమైన ఒకేసారి అమలయ్యింది కానీ రెండవసారి ఎవరికీ రాలేదు. కులాల వారీగా కుల సంఘాల భవనాలు అంటూ ఒకటి, రెండు కులాలకు మాత్రమే నిర్మించారు.
రైతుల రుణమాఫీలో కేవలం 2018లో ఉన్న అప్పు మాత్రమే మాఫీ అయితే వాటికి బ్యాంకులు కట్టిన వడ్డీ అలాగే ఉంది. ఒక కుటుంబములో ఒకరికే అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వక ఎరుపడ్డ కుటుంబాలను నష్టపరిచారు. కౌలు రైతులను గాలికి వదిలారు. పనిముట్ల సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ తీసివేసి రైతు బంధు మాత్రమే ఇస్తున్నారు.
బీసీ, ఎస్సి, ఎస్టీ సామజిక వర్గాలకు ప్రకటించిన పథకాలు అందరికి ఎన్నికల లోపు అమలు పరిచాలి, బీసీ లక్ష సాయం మొదటి దఫా లబ్ధిదారుల పేర్లను వెల్లడించాలి, జనాభాలో సగమున్న బీసీలను విభజించి పాలిస్తున్న కెసిఆర్ నీ మాయ ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రేస్ ప్రభుత్వం సమానత్వం, సమన్యాయం చేస్తూ ప్రతి పథకం ప్రతి ఒక్కరికి ఒకేసారి అందించామని,మళ్లీ రానున్న మా ప్రభుత్వములో అందిస్తామని తెలుపుతూ ఎన్నికలలోపు బీసీ సహాయం అందిరికి అందించాలని లేని యెడల మంత్రి ని, ఎమ్మెల్యే రసమయిని అడుగడునా అడ్డుకుంటామని ఇది బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకుల హెచ్చరికని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,కిసాన్ సెల్ అద్యక్షుడు రొడ్డ మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకటి రాములు,యూత్ మాజీ అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,అధికార ప్రతినిధి జనాగం శంకర్ , టీపీసీసీ సోషల్ మీడియా దోనే వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు మహేందర్ ,రేగులపల్లె గ్రామ అధ్యక్షుడుజీల లింగం,దాచారం గ్రామ అధ్యక్షుడు రంగోని రాజు, సంగేమ్ రాజేందర్, నర్సింములపల్లె యూత్ అధ్యక్షుడు జెట్టి అనిల్,బెజ్జంకి టౌన్ యూత్ నాయకుడు ఉపేందర్,నరేందర్ రెడ్డి,బిగుళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.