కరీంనగర్ జిల్లా: గృహలక్ష్మి పథకంపై గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల్లో మండల పరిషత్,రెవెన్యూ, ఐకేపీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. మాదాపూర్, పారువెల్ల గ్రామాల్లో ఎంపీడీవో స్వాతి సర్వే చేపట్టారు. అలాగే జంగపల్లిలో ఏపిఎం లావణ్య, గన్నేరువరంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టినట్లు తెలిపారు.
