- జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
కరీంనగర్ జిల్లా: ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వాక్యలపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడని అబద్దపు వాక్యలను ఆపాదించి మంత్రి పట్ల నీచమైన వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యయని, సభ్య సమాజం తలదించుకునేదని జడ్పీటీసీ దుయ్య బట్టారు. మంగళవారం రోజు చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై, వారి తల్లిపై చేసిన వ్యాఖ్యలు హర్షించదగేవి కావని ఆయన అన్నారు. బండి సంజయ్ కు అభివృద్ధి పట్ల ఆలోచన లేదని, గత 5 సంవత్సరాలలో ఏనాడు కనీసం ఒక్కసారి జడ్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు.పార్లమెంట్ ఎన్నికలస్తున్నాయని అధికార దాహంతో మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. గల్లీ నుండి ఢిల్లీకి పోయిన గాని తన స్థాయి మారలేదన్నారు. విధాన పరమైన, పరిపాలన పట్ల సరైన అవగాహన పెంచుకోవాలనీ హితవు పలికారు. పొన్నం ప్రభాకర్ విలువలతో కూడిన వ్వక్తిత్వమని, హిందూ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తారని అన్నారు. బండి సంజయ్ కి సనాతన ధర్మం పట్ల అవగాహన లేదని, కన్న తల్లిని గౌరవించలేని కుసంస్కార వంతులన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించబొదని, తెలంగాణ పల్లెలల్లో తిరగనీయబొమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్,డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ప్రధానకార్యదర్శి పూల లచ్చిరెడ్డి, చిగురుమామిడి రామంచ గ్రామ శాఖల అధ్యక్షులు వంగ కనకయ్య, వంటకాల సంపత్ రెడ్డి, నాయకులు కవ్వంపల్లి సంజీవ్, పోటు మల్లారెడ్డి, బెజ్జంకి అంజయ్య, తాళ్లపెళ్లి రాములు గౌడ్, పెసరి శ్రీనివాస్, చెల్పూరి విష్ణుమాచారి, పోలు శ్రీనివాస్, బోయిని వంశీకృష్ణ, పన్యాల జగన్ రెడ్డి, దొడ్ల రమణా రెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణ, అనువోజు బాలకృష్ణ చారి, దోమ తిరుపతి రెడ్డి, గుజ్జుల రాజు తదితరులు పాల్గొన్నారు.