సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం బుసరపల్లి గ్రామంలో తక్కెలపాటి రమేష్ NRI ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇది మంచి ప్రభుత్వం “కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ NDA ప్రభుత్వం వచ్చి 100 రోజులలో ఎన్నో పధకాలను అమలు చేసింది. ఈ గ్రామంలో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్డుస్ స్ట్రీట్ లైట్స్ అనేక సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు. గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కరపత్రలను అందచేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నం ప్రసాద్ ,పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు ,పుట్టా బ్రహ్మయ్య ,గ్రామ పార్టీ అధ్యక్షులు కూనంనేని శ్రీనివాసరావు , మండల తెలుగు యువత అధ్యక్షులు కూనంనేని లోకేష్ , తాసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో, లక్ష్మినరసయ్య ,రాజ ,సింగారెడ్డి ,మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.