contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

జగిత్యాల : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, నిరుద్యోగ యువతీ యువకులకు 2000 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళా వేడుకను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం, ఎస్పీ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి వివిధ స్టాల్స్‌ను సందర్శించి, యువతతో మాట్లాడి, ఆహ్వానిత కంపెనీల నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ జాబ్ మేళాలో IT, Non-IT, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి విభాగాల్లో 50 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2000 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను ఆరా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీలు ఎంపికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ఉద్దేశ్యమై 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించాం. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 2000 మందికి ప్రైవేట్ మరియు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నాం,” అన్నారు.

10వ తరగతి నుండి పీజీ వరకు ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నట్లు తెలిపారు. “మనం అనుకున్న ఉద్యోగం ఎక్కడ వచ్చినా, ఆ ఉద్యోగాన్ని చేజిక్కించుకోండి. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో అభివృద్ధి సాధించడం తప్పకుండా సాధ్యం,” అని యువతికి ఆక్టివేట్ చేస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పిలు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, సీఐలు, ఎస్‌ఐలు తదితర పోలీసులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :