అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు గుమ్మనూరు వారి సమ్మర్ కూల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంకు టోర్నమెంట్ నిర్వాహకులు ఎర్రిస్వామి ప్రత్యేక ఆహ్వానం మేరకు గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి మరియు గుత్తి టిడిపి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరై టాస్ ఎగురవేసి టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి, క్రీడాకారుల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్స్ కి all the best అని తెలిపారు, అనంతరం కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరిని ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమం లో పామిడి పట్టణం, మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
