తూప్రాన్: మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఈ రోజుతో ముగిసాయని ఆర్. డి.ఓ జయ చంద్రా రెడ్డి అన్నారు. అనంతరం ఒక ప్రకటనలో ఈ సందర్భంగా వెల్లడిస్తూ తూప్రాన్ డివిజన్ పరిధిలో భూ సమస్యల పై 8229 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్ , విస్తీర్ణం సవరణ, పేరు సవరణ, పెండింగ్ మ్యుటేషన్ , ఫౌతి (విరాసత్ ) , డిజిటల్ సంతకం పెండింగ్, సాదాబైనమా, పి ఓ టి , కుటుంబ తగాదాలు వంటి మరియు ఇతర భూ సమస్యలకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందరి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని, సాదాబైనామా మరియు పి వో,టీ దరఖాస్తులను ప్రభుత్వం ఇచ్చే సూచనల మేరకు పరిష్కరిస్తా మన్నారు. దరఖాస్తు దారులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం భూ భారతి చట్టం లో అప్పీల్ వ్యవస్థ తీసుకొచ్చిందని అందరి భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ బృందం రెవెన్యూ సదస్సులో క్రమం తప్పకుండా , ఎలాంటి సమస్యలు లేకుండా , ప్రశాంతంగా , టోకెన్ పద్ధతిలో పకడ్బందీగా నిర్వహించారని సాయంత్రం 6 వరకు కూడా గ్రామం లోనే ఉంటూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రైతులకు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. ఇందుకు రైతులు మరియు గ్రామ ప్రజలు కూడా ఎంతో సహకరించారని, రైతులు , గ్రామ ప్రజల సహకారం తోనే సదస్సులు సజావుగా , ప్రశాంతంగా ముగిసాయని ఆర్. డీ. ఓ జయ చంద్రా రెడ్డి తెలిపారు.
