మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో హల్దీ వాగు వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు తూప్రాన్ పోలీసులు, ఆర్ ఐ ప్రేమ్ కుమార్ దాడులు నిర్వహించారు. అక్కడ రెండు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ ఐ ఫిర్యాదు మేరకు కిష్టాపూర్ కు సంబంధించిన కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
