కరీంనగర్ జిల్లా: జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన రాష్ట్ర వ్యవసాయశాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తో సచివాలయంలో మంత్రి తుమ్మలను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధి, రాజకీయ పరిస్థితుల గురించి వారితో చర్చించారు.
