contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మామిడికాయ రైతులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువులో మ్యాంగో నగర్ కి వచ్చిన మామిడికాయ రైతులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదివారం మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు సుమారు 200 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడింది అన్నారు. మామిడి రైతులు అధైర్య పడవద్దని చివరి కిలో వరకు కిలో కు 4 రూ” అదనపు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి నివేదించాం అన్నారు. అందులో భాగంగానే మంత్రిగారు దామలచెరువుకు రావడం జరిగిందని పులివర్తి నాని పేర్కొన్నారు. గుజ్జు పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి మరింత రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అన్నారు. ర్యాంపుల వద్ద ప్రత్యేక బృందాలను నియమించి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, వ్యవసాయ శాఖ, ఏపీఎం, ఇతర అధికారులను మ్యాంగో నగర్ లోనే ఉండి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే కుక్కల పల్లె ప్రజల నీటి సమస్యకు వేంటనే నూతన బోర్ ఏర్పాటు చేసి నీటి సమస్యకు పరిష్కకారం చూపాలి అని అధికారులను ఆదేశించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :