contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్-26) సందర్భంగా యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సీపీ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను విడుదల చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటమే ఈ అవేర్‌నెస్ వీక్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వారం రోజుల పాటు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్-ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ కార్యక్రమాలు, కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువత ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, అనుమానాస్పద అంశాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ అవేర్‌నెస్ వీక్ ద్వారా యువతలో చైతన్యం పెంపొందించి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :