బాల్కొండ : నిజామాబాదు జిల్లా బాల్కొండ లో బాల్కొండ లో పురి జగన్నాథ్ యాత్ర శనివారం కన్నుల పండగగా జరిగింది.ఈ యాత్ర అల్ల కొండ ఖిల్లా ఆర్మూర్ బేస్ (కమాన్) నుండీ ప్రారంభమై ఖిల్లా దూదేకుల బేస్ ద్వారా పాత, కొత్త బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ ద్వారా ఖిల్లా సఫల్ కట్టా నుండీపట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ కృష్ణ మందిరం వద్ద ముగిసింది. ఈ యాత్రలో నిజామాబాదు, నాందేడ్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలానుండీ హరేకృష్ణ భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక విశ్వహిందూ పరిషద్, శ్రీ కృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యoలో జరిగింది, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కాట్రాజీ నరేందర్, శ్రీ శ్రీ హరచారి నారాయణ, అంబటి నవీన్,దీపక్ గౌడు,సీరియల జగన్, ఎస్. సంతోష్,బజరంగ్సేవ దళ సభ్యులు నేత్రుత్వం వహించగా,యువ మోర్చా, సామజిక సేవ సంఘాల సభ్యులు అశేష భక్తులకు మంచినీరు,పురి జగన్నాథ్ యాత్ర ప్రసాదాన్ని (పులిహోర ) పంపిణి చేశారు. పురి జగన్నాథ్ యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ అధికారి నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కార్యక్రమం విజయవంతం కావడం విశేషం.
