contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి

పార్వతీపురం:  పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎన్.ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు తొలి కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పట్ల అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.ప్రభాకర్ రెడ్డిని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.

పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు డా.ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్ సురేష్ తదితర అధికారులు కూడా నూతన కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని, తమ పూర్తి సహకారం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నూతన కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :