contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాఠశాల భవనం కోసం ధర్నా.. రిపోర్టర్ టీవీ కథనంతో అధికారుల స్పందన

అనకాపల్లి / రావికమతం : రావికమతం మండలం కొమిర గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ఆందోళనకు సంబంధించి రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనం ఫలితాన్నిచ్చింది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించారు.

మంగళవారం ఎస్ఎస్ఎ ఏఈ, ఎంఈవో ఎం. లింగమూర్తి కొమిర గ్రామంలోని పాఠశాలను సందర్శించి భవన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల పరిస్థితిని నిశితంగా పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు.

పాఠశాల భవనం సమస్యను త్వరితగతిన పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, స్థానిక మాజీ సర్పంచ్ జి. రవికుమార్, సొలం రాజు తదితరులు పాల్గొన్నారు.

మా పిల్లల చదువు కోసం పాఠశాల భవనం నిర్మించండి

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :