సంగారెడ్డి / అమీన్ పూర్ : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మండల పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపల్ పరిధిలో వివిధ కాలనీలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 57 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తాసిల్దార్ రాధా, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.