జిన్నారం మండల పరిధిలోని కస్తూర్భా పాఠశాలను అమ్మ ఫౌండేషన్ శ్రీకాంత్ తో కలిసి సందర్శించిన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది వారికి సరిపడా భోధనేతర సిబ్బంది కొరతతో పాటు బెంచీలు లేవని పలు సమస్యలు విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు తాము పరిశీలించిన బియ్యంలో నూకలు ఉన్నాయని మరియు పిల్లలకు వడ్దీస్తున్న చారులో నాణ్యత లేదని బాలికల వసతి గృహమైనప్పటికీ వాచ్ మెన్ లేడని విద్యార్థులు తెలిపారు ఇదే సమస్య పై మెట్టు శ్రీధర్ ఫోన్ ద్వార కలెక్టర్ గారికి సమస్యను విన్నవించారు అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అనంతరం పాఠశాలలోని విద్యార్థులందరికి మెట్టు శ్రీధర్ బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రవి అరవింద్ మనోహర్ మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది