అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో అధ్యక్షుడు అబూబాకర్ ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, మరియు, అదనపు కార్య దర్శి జేన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ మాకు ఒకటవ తేదీన పెన్షన్ ఇవ్వాలి.పెండింగులో ఉన్న డి.ఏ.లు అన్ని చెల్లించాలి. మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల రూపాయల నుండి “పది లక్షల రూపాయల”వరకు పెంచాలని అబూబాకర్ తెలిపారు. ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన ఫారం.16. అందరికి ఇచ్చాము.పెన్షనర్ ఒకసారి “ఈ ఫైలింగ్” చేపిస్తే ప్రతి సంవత్సరము “ఈ ఫైలింగ్ “చేపించాలి. అలా ఈ ఫైలింగ్ చేయించక పోతే “పది వేల రూపాయలు ఫెనాల్టీ కట్టాలి. గడువులోగా రిటన్లు చేయకపోతే జులై 31, తరువాత రిటర్న్స్ దాఖలు చేసేవారు. సెక్షన్ 234 f కింద పెనాల్టీ చెల్లించాలిసి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి రూ.వెయ్యి రూపాయలు, రూ.5 లక్షలు మించి ఆదాయము ఉంటే రూ.5 వేలు పెనాల్టీ చెల్లించాలి అని కోరడమైనది. ఈకార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రెటరీ రామ్ మోహన్,అదనపు కార్య దర్శి జేన్నే కుల్లాయిబాబు ,పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు.
