- తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్..
కరీంనగర్ జిల్లా: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని, విమోచన పోరాటాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, పోరాట యోధులు మరణించిన ప్రదేశాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు, బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, పాల్గొని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ తపాల నరసింహస్వామి దేవాలయం నుండి అలుగునూర్ చౌరస్తా వరకు జాతీయ జెండాలు, బిజెపి జండాలతో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందుకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తానని గద్దెనెక్కి ఇప్పుడు ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారి సమక్యా దినం అనడం సరైంది కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, దరువు ఎల్లన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, కోత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య,తిమ్మాపూర్, మానకొండూరు, మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, రాపాక ప్రవీన్ మియాపురం లక్షణాచారి, సిరిసిల్ల చంద్రయ్య, కత్తి ప్రభాకర్ గౌడ్, సార్ల అనిల్, కాల్వ సాయి, మావురపు సంపత్,కిన్నర అనిల్, ఎర్రోజు లక్ష్మణ్,తిరుపతిరెడ్డి, గడ్డo అరుణ్, బామండ్ల రాజు, బోయిని అభిషేక్, కొంకటి అనిల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.