పోలీసుల అవసరాలకు గూడ్స్ ట్రాలీలను పంపలేదని కక్ష సాధింపు చర్యలకు పోలీసులు పాలుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాలీ డ్రైవర్లు. వివరాల్లోకి వెళితే మంచిరియల్ జిల్లా చెన్నూర్ లో గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. అడ్డాపై నిలిపిన వాహనాలకు పోలీసులు అడ్డగోలుగా చలాన్లు వేశారని, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో జీవనం సాగిస్తున్న తమ వాహనాలకు కొన్ని ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ, నిలిపి ఉన్న 8వాహనాలకు 12వందల నుండి 15వందల రూపాయల చలాన్లు వేయడం సరైంది కాదని, గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే వారికి వంతుల వారీగా తమ వాహనాలు పంపిస్తున్నామని, నేడు ఒక్కరోజు పంపించని కారణంగా కక్ష సాధింపు చర్యగా తమను ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ, తమ వాహనాలకు పోలీసులు చలాన్లు వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో డ్రైవర్లు జూపాల రాములు, కొట్టె రాజబాపు, ఎండీ ఇమ్రాన్, ఎండీ పాషా, చాకినాల కుమార్, ఆవుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.