contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిరుపై మోదీ ప్రశంసల వర్షం..

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిపై (Chiranjeevi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022’ పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.
”చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణనూ పొందుతున్నారు. గోవాలో జరుగుతోన్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు” అని పేర్కొన్నారు.
గోవాలోని పనాజీలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు ఈ నెల 29 వరకూ కొనసాగనున్నాయి. మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే, సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :