మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావు పేట్ శివారులో గల అసైండ్ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలపై కొందరు భూ కబ్జా దారులు దాడి చేసి గుడిసెలను తగులబెట్టారు. సంఘటన స్థలాన్ని సీపీఎమ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య, మహిళా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సందర్షించారు, బాధితులను పరామర్శించి, దాడిని ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని, పేదల గుడిసెలపై దాడి చేసి వారు తాగే మంచినీటిలో మూత్రం పోయడం హేయమైన చర్యని , దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)