పల్నాడు జిల్లా, కారంపూడి : పట్టణంలోని స్థానిక అంకాలమ్మ గుడి సెంటర్లో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్చకులు సీతారాముల కల్యాణం వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపించారు. ఆర్యవైశ్య యువజన విభాగ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నధానం కార్యక్రమం నిర్వహించారు.