contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ. 12 కోట్లు స్వాహా … దొంగ దొరికాడు

మహారాష్ట్ర లోని థానే ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంక్ లో రూ. 12 కోట్లు కొల్లగొట్టిన ముఠాలోని కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 12న ఈ దొంగతనం జరిగింది. 43 ఏళ్ల అల్తాఫ్ షేక్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ. 9 కోట్లను రికవరీ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో అల్తాఫ్ సోదరి నీలోఫర్ కూడా ఉంది.

అల్తాఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ లో కస్టోడియన్ గా పని చేస్తున్నాడు. బ్యాంక్ లాకర్ కీస్ కు ఆయన కేర్ టేకర్ గా ఉన్నాడు. ఈ దోపిడీకి సంబంధించి ఏడాది కాలంగా ఆయన ప్లానింగ్ చేశాడు. ఏసీ డక్ట్ ను కొంచెం వెడల్పు చేశాడు. అందులో డబ్బు పడేస్తే నేరుగా పక్కనున్న చెత్తకుప్ప వద్ద పడేలా ఏర్పాటు చేశారు. దొంగతనం సమయంలో సీసీటీవీని ధ్వంసం చేశాడు. అలారం సిస్టమ్ ను డీయాక్టివేట్ చేశాడు. అనంతరం బ్యాంక్ వాల్ట్ ను ఓపెన్ చేసి… డబ్బును ఏసీ డక్ట్ ద్వారా బయటకు పంపించాడు. ఆ తర్వాత డబ్బు మిస్ అయినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించిన తర్వాత ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే షేక్ పరారయ్యాడు. ఆ తర్వాత ఎవరూ తనను గుర్తించకుండా బుర్ఖా వేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఇదే సమయంలో షేక్ కదలికలు పూర్తిగా తెలిసిన ఆయన సోదరి నీలోఫర్ కొంత డబ్బును తన ఇంటికి తరలించింది. ఈ కేసులో ఆమెను కూడా దోషిగా నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ కేసులో మరో ముగ్గురు అబ్రార్ ఖురేషీ (33), అహ్మద్ ఖాన్ (33), అనుజ్ గిరి (30)లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :