contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తుది ఓటర్ల జాబితా మెదక్ జిల్లా కలెక్టర్ వెల్లడి

భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలు,సూచనల ప్రకారం, ప్రత్యేక సవరణ 2025 లో భాగంగా, మెదక్ జిల్లా పరిధిలోని 34-మెదక్, 37-నర్సాపూర్ , అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను రాహుల్ రాజ్ ., జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఈ రోజు  విడుదల చేశారు.

34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని,1,04917 మంది పురుషులు, 1,15987 మంది మహిళలు, 04 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 220908 సాధారణ ఓటర్లు ఉన్నారు.
వీరిలో 9 మంది పురుషులు, 1 మహిళ ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు.10 మంది ఉన్నారని, సర్వీస్ ఓటర్లలో 87 మంది పురుషులు, 2 మహిళలు కలిపి 89 మంది ఉన్నారు.

37-నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని 1,11611 మంది పురుషులు, 118701 మంది మహిళలు, 05 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 2,30317 సాధారణ ఓటర్లు ఉన్నారు.
వీరిలో( 1) మంది పురుషులు ఎన్‌ఆర్‌ఐ ఓటరు ఉండగా, సర్వీస్ ఓటర్లలో 36 మంది పురుషులు, 02 మహిళలు కలిపి 38 మంది ఉన్నారు.

మొత్తం జిల్లావారీగా 216528 మంది పురుషులు, 234688 మంది మహిళలు, 09 మంది థర్డ్ జెండర్ కలిపి 451225 సాధారణ ఓటర్లు ఉన్నారు.

వీరిలో 10 మంది పురుషులు, 1 మహిళ కలిపి 11 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు. సర్వీస్ ఓటర్లలో 123 మంది పురుషులు, 04 మహిళలు కలిపి 127 మంది ఉన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల ప్రకారం, పై ఓటర్ల జాబితాలను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ERO కార్యాలయాల్లో, AERO తహసీల్దార్ కార్యాలయాల్లో, అలాగే జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ కార్యాలయంలో ప్రచురించారు. ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందని ధృవీకరించుకోవాలని, ఏవైనా పొరపాట్లు లేదా మార్పులు అవసరమైతే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని లేదా అధికారిక ఎన్నికల వెబ్‌సైట్‌ను సందర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :