పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గాయత్రి ఫంక్షల్ హాల్ లో మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ తో ఏర్పాటు చేయబడ్డ మెట్రోరైల్ సాధన సమితికి సంబధించిన సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పటాన్ చెరు సంగారెడ్డి లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందని మెట్రోరైల్ సాధన లో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు మెట్రోరైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రోరైల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తూ ఉద్యమంలో భాగం చేసేవిధంగా కార్యాచరణ రూపొందించినట్లు మాజీ ఎమ్యెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్ ఈర్ల రాజు బాసిత్ మెట్టుశ్రీధర్ రాజెందర్ రెడ్డి బిక్షపతి మన్నె రాములు కలివేముల రాజు రమేష్ రవి బలరాం తదితరులు పాల్గొనడం జరిగింది