ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ పోస్ట్ ను వాట్సాప్ లో ఫార్వార్డ్ చేశారన్న కారణంతో అంకబాబును అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. ఈ అరెస్ట్ పై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా స్పందించింది. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటుగా ఆయన అరెస్ట్ అనైతికమంటూ విమర్శలు గుప్పించింది.
విజయవాడ లో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నానంటూ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి సుధాకర్ అన్నారు. వాట్సాప్ లో ఒక వార్తను ఫార్వార్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించిన సుధాకర్ .. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని వ్యాఖ్యానించారు. తక్షణమే అంకబాబును విడుదల చేయాలని వి.సుధాకర్ డిమాండ్ చేశారు