▪️ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం
▪️ బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
▪️ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన : కాట శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన 25 మంది బీ.ఆర్.ఎస్ పార్టీ మరియు ఎన్ఎంఆర్ యువసేన యువకులు కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీ ఆర్ ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల కన్నీరు ఆగడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే యువతకు భవిష్యత్తు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కాట శ్రీనివాస్ గౌడ్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, వార్డ్ మెంబెర్ యాదగిరి, మాధవ్ రెడ్డి, భవాని, శంకర్ తదితరులు పాల్గొన్నారు.