contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నోట్ల రద్దుపై రికార్డులు సమర్పించండి కేంద్రం,ఆర్‌బీఐకి సుప్రీం ఆదేశాలు..

దిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు (denomination)ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ముగించింది. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ RBI)ను ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దీనికి అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి స్పందిస్తూ.. సంబంధిత రికార్డులను సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తానని తెలిపారు.

2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరిపింది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. ”కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలి. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైనదని చెప్పడం సరికాదు” అని కేంద్రం తరఫున ఏజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :