ఆంధ్రప్రదేశ్ : తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. బుధవారం ఉదయం నుంచి ఛానల్ ఓపెన్ కావడంలేదు. ఎర్రర్ మెసేజ్ వస్తోందని, స్ట్రక్ అయినట్లు చూపిస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. యూట్యూబ్ ఛానల్ ను పునరుద్ధరించేందుకు పార్టీ టెక్నికల్ వింగ్ ప్రయత్నిస్తోందని వివరించారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని, ఛానల్ ను పునరుద్ధరించేందుకు యూట్యూబ్ సాయం తీసుకుంటున్నామని టీడీపీ సాంకేతిక విభాగానికి చెందిన నిపుణులు తెలిపారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)