contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం …

తెలుగు భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం అని మర్రిపాడు మండల టిడిపి సీనియర్ నాయకులు పావులూరి వెంకట్రామయ్య హర్షం వ్యక్తం చేసారు.రాష్ట్ర భాష, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పాలనలో పారదర్శకత ను ప్రోత్సహించడం కోసం టిడిపి కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు.ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై ఆయన స్పందించారు. తెలుగు భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం అని తెలిపారు. తెలుగు భాష పై టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ని, పాలన లో పారదర్శకత కు ఇది నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఇంగ్లీషు జీఓ లు సామాన్య ప్రజలకు అర్థం కాక ఇబ్బందులు ఎదురయ్యేవని ఇకపై ఎటువంటి చీకటి జీవో లు ఉండని జవాబుదారీ ప్రభుత్వాన్ని చూడబోతున్నట్లుగా భావిస్తున్నామన్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలన్న నిర్ణయం కూడా కూటమి ప్రభుత్వంలో త్వరలోనే అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు భాషపై మమకారం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లకు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు పావులూరి వెంకట్రామయ్య కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :