contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం .. సిరీస్ కైవసం

అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 168 పరుగులతో కివీస్ ను చిత్తు చేసింది. ఛేజింగ్ లో 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ప్లేయర్లలో మిచెల్ 35 పరుగులు, శాంట్నర్ (13) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ముగ్గురు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీయగా అర్శదీప్ సింగ్, ముమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకు ముందు టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 63 బంతులను ఎదుర్కొన్న గిల్ 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన టీ20 కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు.

అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి 44 (22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్), హార్దిక్ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీపక్ హుడా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభ్ మన్ గిల్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :