Treason Cases: గడిచిన ఐదేళ్లలో దేశంలో మొత్తం ఎన్ని దేవద్రోహ కేసులు(Treason Cases) నమోదయ్యయో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్(Nithyananda Roy) లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో భారత దేశంలో 701 దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదయ్యాయని మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఈ కేసుల్లో 788 మంది అరెస్ట్ అయ్యారు, 500 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ఇందులో 131 మందిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయని పేర్కొన్నారు. 2021లో 149 దేశద్రోహం కేసులు, 2022లో 68 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)