- టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ కు ఈసీ లేఖ
- ఈ మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం
- బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్
మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యలంతా హాజరుకానున్నారు. ముహూర్త సమయంలోగానే అందరూ తెలంగాణ భవన్ కు చేరుకోవాలని అందరికీ కేసీఆర్ పేరిట లేఖలు వెళ్లాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించనున్న నేపథ్యలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి.