హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహరంలో భాజపా కుట్రలను బయటపెట్టినందుకే ఈడీ కేసులతో తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. ఫిర్యాదుదారుడిని విచారణకు పిలిచి వేధించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని భాజపా చూస్తోంది. వాళ్లకు అనుకూలంగా నందకుమార్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోంది. దొంగే దొంగ అన్నట్లుగా భాజపా వ్యవహారం ఉంది. ఎన్ని కేసులు పెట్టినా.. భయపడేది లేదు. వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బ తీయాలని చూసినా తగ్గేదే లే’’ అని రోహిత్రెడ్డి అన్నారు.
