కరీంనగర్ జిల్లా: శోభకృత్ నామ సంవత్సరము ను పురస్కరించుకుని బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర నాయకురాలు, అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి సుజాత రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అనాధ ఆశ్రమము లో ఉగాది పచ్చడి మరియు బక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుజాత రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం లు ఎన్నో సంతోషాలతో బాటు చాలా ఇబ్బందులతో మానవాళి ని ఇబ్బందుల కు గురిచేసాయని ఈ శుభకృత్ నామ సంవత్సరం నుండి అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉగాది పండుగను వీరి మధ్యలో జరుపుకుంటున్నామని అన్నారు.వీరిని అనాథ లుగా చూడవద్దని తల్లిదండ్రులను వదిలిపెట్టిన వారే అనాథ లు అని అన్నారు. వృద్ధులందరికి ఉగాది పచ్చడి మరియు బక్షాలను పంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్,కీసర విజయ,సుంకపాక స్వప్న, అక్షయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.