వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో పురుగుల మందు తాగిన ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సోని మృతి చెందారు. కాగా మొన్నటివరకు జేపీఎస్లు చేపట్టిన సమ్మెలో పాల్గొన్న ఆమె.. సమ్మె విరమించి నిన్ననే విధుల్లో చేరారు.
