contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం పాఠశాలలో ఘనంగా తెలంగాణ విద్యాదినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గన్నేరువరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు తెలంగాణ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో భాగంగా మొదట ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్రాచారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తెలంగాణ విద్యాభివృద్ధి నినాదాలు చేస్తూ , ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు,గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్, ఎస్ఎంసి ఛైర్మన్, ఎస్ఎంసి సభ్యులు మొక్కలు నాటారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ ఉన్నత విద్యావంతులు కావాలని, తద్వారా పాఠశాలకు, తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసగించారు.డిజిటల్ విద్యను ఉపయోగించుకొని విషయాలను సంపూర్ణముగా అర్థం చేసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు చే పాఠశాల విద్యాభివృద్ధి నివేదిక ప్రవేశపెట్టబడగా  కార్యక్రమంలో చివరగా గత విద్యాసంవత్సరం 10వ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన , మరియు వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.  ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్రాచారి, గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మి, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బుర్ర మల్లేష్ గౌడ్, సభ్యులు కొల్పుల మహేందర్, ఉపాధ్యాయ బృందం, తల్లి తండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :