కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: తెలంగాణ దశబ్ధి ఉత్సవాల సందర్భంగా మండలంలోని జంగపల్లిలో మన ఊరి మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్య అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ, డిజిటల్ స్క్రీనింగ్ క్లాసులు, డైనింగ్ హాల్, నోట్ బుక్స్, రాగి జావా పంపిణి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో స్వాతి, సర్పంచ్ అటికం శారద, ఎంపీటీసీ అటికం రాజేశం గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడేల్లి ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ అటికం రవి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
