కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ముదిరాజ్, యాదవ సంఘం కులస్తుల భవన నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణాలను ఆగస్టు లోగా పూర్తి చేయాలని సూచించారు. మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల కు కమ్యూనిటీ భవనాలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఇందులో కొన్ని నిర్మాణంలో ఉండగా మరికొన్ని పూర్తయినట్లు వెల్లడించారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గుడెల్లి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు
