- గత 13 సంవత్సరాలుగా ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా బ్రహ్మనాయుడు స్కూల్ నందు యోగ క్లాస్ లు
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ చేయండి ఆరోగ్యంగా ఉండండి మాంసాహారం వద్దు శాకాహారం వద్దు అనే నినాదంతో బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలనాడు జిల్లా కారంపూడి లోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు యోగా క్లాసులు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దాదాపుగా 13సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉచితంగా యోగ క్లాసులు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ దేశాలని అందరినీ ఒప్పించి జూన్ 21 న యోగా దినోత్సవం గా ప్రకటించి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని భావనతోనే ఈ యోగ డే ప్రకటించారని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటూ తమ కుటుంబాలను కూడా ఆరోగ్యంగా ఉంచాలని . ప్రతి ఒక్కరికి మాంసాహారం వద్దు శాకాహారమే ముద్దు అనే సూత్రం ప్రతి ఒక్కరూ పాటించాలని కారంపూడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనిఆ దేవుని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగ క్లాస్ ల నిరాహుకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు