- సంఘటన స్థలానికి చేరుకున్న సర్కిల్ సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్.
- క్లూస్ టీం .. ఫింగర్ ప్రింట్స్ సేకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిన్న అర్థ రాత్రి చోరీకి పాల్పడిన దుండగులు. ప్రొద్దున గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద వచ్చి చూడగా రేణుక ఎల్లమ్మ పుస్తె మెట్టలు, బంగారు బొట్టు బిల్లలు, వెండి కండ్లు, వెండి దీపాలు, చెమ్మలు, ఎల్లమ్మ తల్లి పావనం ను దొంగిలించినట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పరిశీలించి క్లూస్ టీం ఆధారంగా ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీకి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.