contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇంటింటికి సంజయన్న రాఖీ..

● పోస్టర్ విడుదల చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

● రాఖీ పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముత్యాల జగన్ రెడ్డిని అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

● రాఖిలతో పాటు మహాశక్తి ఆలయంలో అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన పసుపు కుంకుమ అందజేత

● అనుబంధాలకు ప్రతీక రక్షా బంధన్

 

కరీంనగర్ జిల్లా:మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో గన్నేరువరం మండలం లోని ప్రతీ గ్రామంలో ఇంటింటికి రాఖీ అందించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతులమీదుగా కరీంనగర్ లో శనివారం పోస్టర్ విడుదల చేసారు.అన్నా చెల్లెళ్ళ అనుబందానికి ప్రతీక గా నిలుస్తున్న రాఖీ పండగ ప్రాముఖ్యత ను పెంచడమే లక్ష్యం గా రాఖీ లతో పాటు మహాశక్తి దేవాలయంలో అమ్మవార్ల సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన పసుపు, కుంకుమ పంపిణీ చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్ రెడ్డి తెలిపారు.మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేవిధంగా,సమాజం లో అనుబందాలను మర్చిపోతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కొనియాడారు. అనుబందాలను గుర్తుచేసుకునే విదంగా ఈ రాఖీ పంపిణీ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నట్లు జగన్ రెడ్డి తెలిపారు. కలకాలం నిలిచిబోయే అనుబందాన్ని మర్చిపోలేని రాఖీ పండగ రోజు రాఖీ లను మండల ప్రజలందరికీ అందించే కార్యక్రమాన్ని చేపట్టిన ముత్యాల జగన్ రెడ్డి ని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. ఈకార్యక్రమంలో పుప్పాల రఘు, సొల్లు అజయ్ వర్మ, వరాల జ్యోతి,బండారు గాయత్రి, మాసం గణేష్, తాడూరి కిరణ్ రెడ్డి, బామండ్ల రాజు, మునిగంటి సత్తయ్య, పుల్లెల రాము తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :