contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిద్దలూరు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన

గిద్దలూరు : గిద్దలూరు పురపాలక సంఘంలో ఎన్నికల వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.64 (ఎన్నికలు-1), తేదీ 24.03.2026 ఉత్తర్వుల మేరకు మున్సిపాలిటీని మొత్తం 28 వార్డులుగా విభజిస్తూ చేపట్టిన ప్రక్రియకు ఆమోదం లభించింది.

ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు (నగర పంచాయతీలు మరియు పురపాలక సంఘాలను వార్డులుగా విభజన) నియమాలు, 1994లోని నియమం 4(i) ప్రకారం 28 వార్డులతో రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను ఫారం-Iలో తెలుగు, ఆంగ్ల భాషల్లో 18.05.2026న ప్రచురించారు. ఈ నోటిఫికేషన్‌ను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు పురపాలక సంఘం పరిధిలోని ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించారు.

ముసాయిదా వార్డుల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను అధికారులు స్వీకరించారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం గిద్దలూరు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి ముందు ప్రతిపాదనను ఉంచారు.

25.05.2026న జరిగిన సి.ఆర్. నెం.34 సమావేశంలో ప్రత్యేకాధికారి ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించినట్లు పురపాలక సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో గిద్దలూరు పురపాలక సంఘంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల పునర్విభజన ప్రక్రియలో కీలక దశ పూర్తయినట్లైంది. 28 వార్డుల ప్రాతిపదికన భవిష్యత్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.

ఈ మేరకు ROC.No.391/2026/జి1, తేదీ 20-08-2026 ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :