contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీఆరెస్ ను ఆశీర్వదించండి .. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి.

హుజురాబాద్, కరీంనగర్ జిల్లా : రాబోయే ఎన్నికల్లో మూడో సారి బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని , బీఆరెస్ ను ఆశ్వీర్వదించి హుజురాబాద్ ఎమ్మెల్యే గా తనకు ఓటు వేసి గెలిపించాలని  హుజురాబాద్ నియోజకవర్గ బీఆరెస్ అభ్యర్థి,  పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంక మండలం లోని బ్రహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, కిష్టంపేట గ్రామాల్లో బీఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా 19 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనని గెలిపిస్తే కల్వల ప్రాజెక్టు మినీ మానేరు డ్యాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వెయ్యి కోట్లతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి, మాడ సాధవ రెడ్డి, బీరెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Birde Men Mesh Sports Shoes for Men Running and Walking Shoes
Deal Price: ₹279
https://amzn.to/48MNOtY

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :