contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముత్తన్నపేటలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ నియామకం

  • ముత్తన్నపేటలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ నియామకం

సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో గురువారం కరీంనగర్ మాజీ ఎంపీపొన్నం ప్రభాకర్,కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశ అనుసారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు నూతన కార్యవర్గానికి దిశా నిర్దేశం చేసి పార్టీ ప్రతిష్ట బలోపేతానికి కృషిచేసి అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎన్నికైన నూతన కమిటీకి మాజీ ఎంపీపీఒగ్గు దామోదర్, ఉప సర్పంచ్ గుర్రాల సుధీర్ రెడ్డి, మచ్చ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ నియమాలకు కట్టుబడి ఐక్యమత్యంతో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజ శ్రీనివాస్, బొర్ర మల్లేశం, పరశురాం, రామంచ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

నూతన గ్రామ కమిటీ: 

అధ్యక్షుడు: బండోజు సత్యనారాయణ చారి.
ఉపాధ్యక్షుడు: బొర్ర మహేష్.
యువజన అధ్యక్షుడు: కర్రావుల సందీప్.
యువజన ఉపాధ్యక్షుడు : రామంచ శేఖర్.
ఎస్సీ సెల్ అధ్యక్షుడు : సిరిసిల్ల స్వామి.
ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు : జతనం రజినీకాంత్.
బీసీ సెల్ అధ్యక్షులు: గాజస్వామి.
బీసీ సెల్ ఉపాధ్యక్షుడు : జమీందార్ ఎన్నికయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :